తన ఇంటి, నల్లా పన్నులు కట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన మంత్రి ఎర్రబెల్లి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుఎర్రబెల్లి ట్రస్టు చైర్మన్ పర్సన్ ఉషా దయాకర్లు శనివారం రోజు పర్వతగిరిలోని తన నివాసానికి సంబంధించిన ఇంటి పన్ను, నల్లా పనన్నులను 5,220 రూపాయలను గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితర అధికారులకు కట్టి రశీదులు తీసుకున్నారు. గ్రామ పంచాయతీకి తన ఇంటి, నల్లా పన్నులను కట్టి రాష్ట్రానికి మంత్రి అయినా, తన ఊరులో మాత్రం సామాన్యుడినేనని నిరూపించారు. స్వయంగా ఇంటి పన్ను చెల్లించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా పన్నులు కట్టి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. పన్నులు చెల్లించి ప్రగతికి పాటుపడండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. సగటు పౌరులు పన్నులు కట్టి బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపివో మధుసూదన్ సోమేశ్వరరావు సంపత్, పంచాయితీ సెక్రటరీ రమేశ్, వార్డు సభ్యుడు యాకాంతం, జిపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.