Saturday, April 20, 2024

సమైక్య పాలకులతో ఏరువాక పండుగ దూరం: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagadish Reddy

సూర్యాపేట:  తెలంగాణలో వ్యవసాయాన్ని సమైక్య పాలకులు ధ్వంసం చేయడంతో ఏరువాక లాంటి పండుగలకు తెలంగాణ రైతులు దూరం చేశారని మంత్రి జగదీష్ రెడ్డి తెలియజేశారు. ఆత్మకూరులో ఏరువాక పౌర్ణమి పూజల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని రైతులతో కలిసి పాడి పశువులకు మంత్రి పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.  కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అయిందని ప్రశంసించారు. మట్టితో మమేకమై ప్రకృతితో కలిసి వ్యవసాయం చేయడంతో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదని కొనియాడారు. సిఎం కెసిఆర్ చొరవతో తెలంగాణలో వ్యవసాయం గాడినపడిందన్నారు. నియంత్రిత పంటల సాగు విధానంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని జగదీష్ రెడ్డి ధీమావ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్, జెడ్‌పి చైరపర్సన్ దీపికా, జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News