Saturday, April 20, 2024

అప్పుడైనా..ఇప్పుడైనా పదవి కావాలని అడగను: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తన సేవలు ఎక్కడ అవసరమైతే పార్టీ అక్కడ ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన నివాసం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగే వ్యక్తిని కాదని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చన్న ఈటల.. బండి సంజయ్ తన శక్తి మేరకు పని చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో గెలవాలంటే మా శక్తిని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తల బలం పెంచుకోవడంతోపాటు ఇతర పార్టీల నుంచి సీనియర్ నేతలు రావాలని కోరుకుంటున్నాం. పార్టీ బలోపేతం కోసం అందర్నీ భాగస్వామ్యం చేయాలి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న ఊహాగానాలు తప్పు. జాతీయ పార్టీలో ఢిల్లీ నేతలు ఇక్కడికి రావడం.. మేము ఢిల్లీ వెళ్లడం సహజం‘ అని ఈటల రాజేందర్ అన్నారు.

అధ్యక్ష మార్పు విషయంలో.. ఎన్నికల సంవత్సరంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటుంది తప్ప పేపర్లో రాసినంత మాత్రాన తీసుకోరని వెల్లడించారు. చంద్రబాబు, వైఎస్సార్ నిషేధిత జాబితాలో ఉన్న భూములను వారి అనుయాయులకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇపుడు అదే పని చేస్తున్నారని విమర్శించారు. జంట జలాశయాలు తాగునీరు కోసం మాత్రమే కాదు, వరదల నివారణ కోసం నిర్మించారని గుర్తుచేశారు. ‘వికారాబాద్ కా హవా లాఖో మరీజౌంక దవా‘ అని అన్న ముఖ్యమంత్రే.. ఇప్పుడు విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. భూ సమస్యలకు పరిష్కారం అని చెప్పి తెచ్చిన ధరణి రైతుల కొంప ముంచిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం ఒక్క గజం కూడా ఇవ్వలేదన్నారు. కర్ణాటక గెలవగానే దేశమంతా కాంగ్రెస్ గెలుస్తుందా ? రేవంత్ రెడ్డి మీరు, మీ పార్టీనీ కాపాడుకొండని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News