- Advertisement -
దరఖాస్తులను పరిశీలిస్తున్నామని హైకోర్టుకు చెప్పిన ఢిల్లీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేలు వంతున ఎక్స్గ్రేషియా చెల్లించడానికి దాదాపు 6700 దరఖాస్తులను పరిశీలిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలియచేసింది. ఈ ఎక్స్గ్రేషియా పొందడానికి అర్హులైన దాదాపు 25,000 మంది జాబితాను సిద్ధం చేశామని అయితే ఇప్పటివరకు 6719 దరఖాస్తులు వచ్చాయని, 3200 మందికి నగదు అందచేయడమైందని, మిగతా వారికి అందించే ప్రక్రియ ప్రారంభించామని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా ఈ ప్రక్రియకు దూరంగా 18,000 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలియచేసింది.
Ex-gratia to kin for Covid deaths: Delhi govt
- Advertisement -