Saturday, April 20, 2024

తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు

- Advertisement -
- Advertisement -

Excise police attack on wine

మనతెలంగాణ / ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలములోని గుండారం పోచమ్మ తండా నర్సింహులుగుట్ట , బాకూర్‌పల్లి, బొగ్గుల కింది తండాలతో పాటు తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో సొమవారం ఉదయం ఎక్సైజ్ శాఖ సిఐ చంద్రశేఖర్ అధ్వర్యంలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి 70 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నాటు సారా తయారు కోసం బెల్లం పానకం సిద్దంగా ఉంచిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.తిమ్మిపూర్ అటవీ ప్రాంతంలో రహస్య ప్రాంతాలను గుర్తించి సోదాలు చేసినట్లు తెలిపారు. నల్లబెల్లం పటిక వంటి ముడి పదార్థాలను సప్లైయి చేసే వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాటు సారాయి తయారు చేసిన వారితో పాటు విక్రయించే వారిపైకఠిన చర్యలు తీసుకోగలమని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ కిషన్ ట్రైనీ ఎస్‌ఐలు శ్రీకాంత్ శేఖర్ రాజేందర్ హెడ్ కానిస్టేబుల్లు అబ్దుల్లా మజీద్ కానిస్టేబుల్లు హమీద్ సుమన్ పర్శరాములు రూప అనూష రజిత పాల్గొన్నారని సిఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News