హైదరాబాద్: ఫేస్ బుక్ లో పరిచయమైన మహిళతో యువకుడు వివాహేతర సంబందం పెట్టుకొని హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉత్తర ప్రదేశ్ కు చెందిన జాకీ అక్తర్ అనే వ్యక్తికి ఓ మహిళ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ముంబయిలో అక్తర్ వస్త్ర వ్యాపారం చేస్తూ ఆమెను ఒక రూమ్ లో ఉంచి కామ కోరికలు తీర్చుకునేవాడు. గత కాలంగా ఆమె పెళ్లి చేసుకోవాలని అక్తర్ పై ఒత్తిడి తీసుకరావడంతో సదరు మహిళను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అక్తర్ తన తమ్ముడితో కలిసి మర్డర్ ప్లాన్ వేశాడు. జాకీ అక్తర్ తన తమ్ముడితో కలిసి సదరు మహిళను రంగారెడ్డి జిల్లాలో హత్య చేశారు. ఏడు సంవత్సరాల తరువాత నిందితులను పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. సదరు మహిళ అతడి కంటే పది సంవత్సరాలు వయసు ఎక్కువ కలిగి ఉంది.