Tuesday, April 16, 2024

నేటి నుంచి భారతీయ విమానాశ్రయాల్లో ముఖ గుర్తింపు అమలు

- Advertisement -
- Advertisement -
డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా విమానాశ్రయాలలో ప్రయాణీకుల కాంటాక్ట్‌లెస్, నిరాటంక ప్రాసెసింగ్‌ను సాధించడానికి ఉద్దేశించబడింది.

న్యూఢిల్లీ:  అవాంతరాలు లేని విమాన ప్రయాణ అనుభవం కోసం, భారతదేశం నేడు ‘డిజి యాత్ర’ అనే యంత్రాంగాన్ని ప్రారంభించనుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టి) ఆధారంగా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు కాంటాక్ట్‌లెస్, నిరాటంక ప్రాసెసింగ్‌ను సాధించడానికి డిజి యాత్ర రూపొందించబడింది.

నేడు  మొదట మూడు విమానాశ్రయాలు  ఢిల్లీ, బెంగళూరు,  వారణాసిలలో ప్రారంభించారు. తర్వాత నాలుగు విమానాశ్రయాలు  హైదరాబాద్, కోల్‌కతా, పూణె, విజయవాడ  మార్చి 2023 నాటికి ప్రారంభించనున్నారు. ఆ తరువాత, ఈ సాంకేతికత దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి ఆధార్ ఆధారిత ధ్రువీకరణ , స్వీయ-చిత్రం క్యాప్చర్‌ని ఉపయోగించి డిజి యాత్ర యాప్‌లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News