- Advertisement -
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తికి మహిళలు మంగళవారం దేహశుద్ధి చేశారు. భూత వైద్యం పేరులో 15ఏళ్ల బాలికను లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న దొంగ బాబాను బాధితులు, మహిళలు చితక బాదారు. బాలికకు కడుపు నొప్పిరావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. బాలికను బెదిరించి కోరికను తీర్చుకుంటున్నట్టు బాధితురాలు తెలిపింది.దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, మహిళాసంఘాలు నిందితుడికి బడితపూజ చేశారు. అయితే ఇప్పటికే నిందితుడు వైద్యం పేరుతోమహిళపై లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు చేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Fake Baba molestation minor girl in Nizamabad
- Advertisement -