Thursday, April 25, 2024

గోల్డ్ వ్యాపారిని బెదిరించి.. బైక్, నగదుతో ఉడాయించిన నకిలీ పోలీసులు..

- Advertisement -
- Advertisement -

crime news

 

హైదరాబాద్:ఓ బంగారు ఆభరణాల తయారిదారుడిని పోలీసులమంటూ బెదిరించి.. బైక్, మొబైల్, డబ్బులను లాకెళ్లిన ఘటన మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి పాత బస్తికి చెందిన ఇద్దరూ పాత నేరస్తులు వసీం, గౌస్ లు పోలీసులమంటూ, నిన్ను ఓ కేసు విషయంలో విచారించాలని మాదన్నపేటలో నివసిస్తున్న వెస్ట్ బెంగాల్ కి చెందిన గోల్డ్ వ్యాపారి సమంథ్ ను బైక్ పై ఎక్కించుకొని దగ్గరలోని ఆంధ్ర బ్యాంక్ వద్ద ఉన్న ఎటిఎంకి తీసుకెళ్లారు. ఎటిఎం నుంచి రూ.10,000 నగదును డ్రా చేయించి, బాధితుడి బైక్, మొబైల్ లాక్కొని అక్కడి నుంచి ఉడయించారు. దీంతో కంగుతిన్న బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన మాదన్నపేట్ పోలీసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా రెండు గంటలలోపు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.

Fake Cop extorted money from Gold merchant in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News