Friday, March 29, 2024

తగ్గుతున్న పసిడి, వెండి ధరలు

- Advertisement -
- Advertisement -

Falling down Gold and silver prices

 

ముంబై : బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.480 తగ్గి రూ.47,702కు చేరింది. సోమవారం బంగారం పది గ్రాముల రేటు రూ.48,182గా ఉంది. అలాగే వెండి ధర విషయానికొస్తే, కిలో ధర రూ.3,097 తగ్గి రూ.70,122కు పడిపోయింది. అయితే హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.49,260 (24 క్యారెట్లు) ఉంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,847 డాలర్లు, వెండి ధర ఔన్స్‌కు 27.50 డాలర్లకు చేరింది. బడ్జెట్‌లో ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకం తగ్గించడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేపట్టడం, అంతర్జాతీయ కారణాల వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News