Tuesday, April 23, 2024

కుమురం భీం జిల్లాలో కుటుంబం ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Family Attempted suicide in Komaram Bheem district

కాగజ్ నగర్: కుమురం భీం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాగజ్ నగర్ మండలం బసంతినగర్ లో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. విషం తాగి ముగ్గురు పిల్లలు సహా వదిన, మరిది బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త మరణించడంతో సదురు మహిళ మరిదితో కలిసి ఉంటుంది. గమనించిన స్థానికులు ఐదుగురిని సమీప ఆస్పత్రికి తరలించారు. మహిళ, పిల్లలు క్షేమంగా ఉందని, మరిది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే వీరు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Family Attempted suicide in Komaram Bheem district

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News