Friday, March 29, 2024

సంగారెడ్డి జిల్లాలో కుటుంబం బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

Family forced death in Sangareddy district

 

సంగారెడ్డి: జిల్లాలో ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్, లావణ్య భార్యభర్తలు. వీరికి ప్రత్యూష్, ప్రజ్ఞ అనే ఇద్దరు పిల్లలున్నారు. చంద్రకాంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. వ్యాపారం కోసం గత కొంతకాలంగా వీరు బిహెచ్ఇఎల్ లో స్థిరపడ్డారు. ఇటీవల వ్యాపారంలో నష్టం రావడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవల కారణంగా భార్య పిల్లలను తీసుకుని ఇంటినుంచి వెల్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రకాంత్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణం తెలిసి లావణ్య కూడా పిల్లలతో సహా అందోల్ పెద్ద చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News