Friday, April 26, 2024

నిజామాబాద్ లో అమానవీయ ఘటన

- Advertisement -
- Advertisement -

Family members who left the old woman's body in cemetery

నిజామాబాద్: జిల్లాలోని ప్రగతి నగర్ లో మంగళవారం అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలి మృతదేహన్ని కుటుంబీకులు శ్మశానవాటికలో వదిలివెళ్లారు. నిన్న ఉదయం నుంచి మృతదేహం శ్మశానవాటికలోనే ఉంది. సోమవారం వృద్ధురాలి మృతదేహన్ని కుటుంబసభ్యులు ఆటోలో శ్మశానవాటికకు తీసుకొచ్చారు. కట్టెలు తెస్తామని శ్మశానవాటిక వాచ్ మెన్ కు చెప్పి కుటుంబీకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు తిరిగి రాకపోవడంతో వాచ్ మెన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News