Friday, April 19, 2024

ఫ్యామిలీ దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

భార్య, కూతురుతో కలిసి చోరీలు
అరెస్టు చేసిన కామాటిపుర పోలీసులు
Family thief arrest in Hyderabad

మనతెలంగాణ, సిటిబ్యూరో: ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ఫ్యామిలీని కామాటిపుర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి, వట్టేపలికి, మోఘల్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం అలియాస్ ఎంఎ రెహ్మన్ పాతదుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. అతడి భార్య జకియా బేగం అలియాస్ జకియా సుల్తానా, కూతురు ఆయేషా సిద్ధిఖీ(19) కలిసి చోరీలు చేస్తున్నారు. ముగ్గురు కలిసి చాద్‌లాల్ బారాదరి, గుల్షాన్ నగర్, ఘాజీ బండా తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఎవరిదైనా ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉంటే వెంటనే ఇంట్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్నారు. భర్త సలీం బైక్‌పై వచ్చి భార్య జకియా బేగం, కూతురు ఆయేషాని దింపివెళ్తున్నాడు. బయటి ఆయేషా కపాలా ఉండగా తల్లి ఇంట్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేస్తోంది. తర్వాత సలీం వచ్చి వారిని తీసుకుని వెళ్లేవాడు. ఒకవేళా ఎవరైనా గమనించి ప్రశ్నిస్తే ఇంటి అద్దె కోసం తిరుగుతున్నామని చెప్పేవారు. ఇలా చేస్తున్న నిందితులు గతంలో సంతోష్‌నగర్, భవానీనగర్, మాదాన్నపేట పోలీస్ స్టేషన్లలో చోరీలు చేయడంతో నాలుగు కేసులు నమోదయ్యాయి. కామాటిపుర డిఐ శ్రీనివాస్, డిఎస్సై డానియల్, పిసి అబ్దుల్ జలీల్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News