Wednesday, April 24, 2024

మంజీరా నది…. మొసలి దాడిలో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు విడిచిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మంజీరా నదిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…… ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు అనే రైతుకు గేదెలు ఉన్నాయి. గేదెలను కడగడానికి మంజీరా నదిలోకి దిగాడు. అతడిపై మొసలి దాడి చేసి నీళ్లలో లాకెళ్లుతుండగా అక్కడ ఉన్న రైతులు కర్రలతో కొట్టారు. మొసలి అతడిని నీటి లోపలికి తీసుకెళ్లింది. రెండు గంటల సమయం తరువాత నీటిలో రాములు మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారులు అక్కడికి చేరుకొని మొసలిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News