- Advertisement -
మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన జిల్లాలోని హవేళిఘనపూర్ మండలం నాగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు ఆరె బాబు(40) తన వ్యవసాయ పొలానికి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
- Advertisement -