Saturday, April 20, 2024

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపూరం గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు మృతి చెందారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం… యర్రమాది విశ్వనాదమ్ అనే రైతు (59) తన పొలంలో పంటను చూసేందుకు వెళ్తున్న క్రమంలో 11 కెవి హైటెన్షన్ వైరు తెగి క్రింద పడడంతో అది గమనించకుండా వెళ్తున్న క్రమంలో విద్యుత్ గతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News