Saturday, April 20, 2024

రైతు బాంధ‌వుడు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రైతుబంధు వారోత్సవాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Farmer relative CM KCR

నిర్మ‌ల్: రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి సిఎం కెసిఆర్ ప్ర‌తీ రైతుకు బంధువు అయ్యార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ల‌క్ష్మ‌ణ‌ చాంద‌ మండ‌ల కేంద్రంలోని రైతు వేదికలో రైతు స‌మ‌న్వ‌య స‌మితి ఆద్వ‌ర్యంలో నిర్వ‌హించిన రైతు బంధు వారోత్స‌వాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. సిఎం కెసిఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు.” తెలంగాణ రైతు బంధు, సిఎం కెసిఆర్ చిత్రాలను విద్యార్థినిలు, మహిళలు ముగ్గులు వేసారు. ముగ్గుల‌ను ఆస‌క్తిగా తిల‌కించిన మంత్రి…. విద్యార్థుల‌ను అభినందించారు. ముగ్గుల పోటీలు, వ్యాస ర‌చ‌న పోటీలు నిర్వ‌హించి విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ సార‌ధ్యంలోని టిఆర్ఎస్ ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌న్నారు. రైతుల కోసం రైతు బీమా, రైతు బంధు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. గ‌తంలో వ్య‌వ‌సాయం దండ‌గా అంటే స్వ‌రాష్ట్రంలో వ్యవ‌సాయాన్ని పండుగ‌లా మ‌ర్చార‌న్నారు. రైతు బంధు ప‌థ‌కం ద్వారా రెండు పంట‌ల‌కు పెట్టుబ‌డి స‌హాయం అందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అప్పుల బాధ‌తో రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారు అని, తెలంగాణ రాష్ట్రంలో అన్న‌దాత‌ల క‌ష్టాలు తీరాయ‌న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News