Friday, April 19, 2024

మాస్టర్ ప్లాన్ ను మార్పు చేయాలని కదం తొక్కిన రైతులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్ర మాస్టర్ ప్లాన్ తక్షణమే రద్దుచేసి ప్రజలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో రైతులకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులు ర్యాలీగా కలెక్టరేట్ చేరుకోగా భావాంచనీయ సంఘటన జరగకుండా అడిషనల్ ఎస్పి అనన్య డి.ఎస్.పి సోమనాథం ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా బారికేడు ఏర్పాటు చేశారు. అగ్ర ఆవేశాలకు లోనైనా రైతులు భారీ కేడను తొలగించారు. కలెక్టర్ వచ్చి వినతి పత్రం తీసుకునే వరకు ఇక్కడే బైటా ఇస్తామని కలెక్టరేట్ ముందు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News