Wednesday, April 17, 2024

వేటకు అమర్చిన కరెంట్ తీగలు తగిలి తండ్రి, కొడుకు మృతి

- Advertisement -
- Advertisement -

Father and son killed by electric wires

భద్రాద్రికొత్తగూడం జిల్లాలో దుర్ఘటన

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ ఉపేంద్రరావు

మన తెలంగాణ/అశ్వారావుపేట : వేటకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కొడుకులు మరణించిన విషాధ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండలంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరు దానియేలు(45) అతని కుమారుడు బాలు(22), సోదరుడు విజయ్‌లతో కలిసి తప్పిపోయిన తమ పశువులను వెతుక్కుంటూ గ్రామ శివారు ప్రాంత అటవీ ప్రాంతానికి వెళ్ళారు. ఈక్రమంలో ఓ మామిడి తోటలో నుండి వెళ్తుండగా అక్కడ అటవీ జంతువుల వేటకోసం అమర్చిన విద్యుత్ తీగలు బాలు, దానియేలుకు తగలడంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై వారు అక్కడికక్కడే మరణించారు. అక్కడే ఉన్న విజయ్ గాయాలతో బయటపడగా గ్రామానికి చేరుకొని కుటుంబీకులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అశ్వారావుపేట సిఐ బంధం ఉపేంద్రరావు స్థానిక ఎస్‌ఐ వెంకటరాజుతో ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News