భార్య కాపురానికి రావడంలేదన్న మనస్తాపంతో ఇద్దరు చిన్నారులను చెట్టుకి ఉరి వేసి తానూ వేసుకున్న తండ్రి
తాండూరు మండలం మడుగు తండాలో విషాదం
వికారాబాద్/తాండూరురూరల్ : గుండ్ల మడుగుతండాలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త మనస్తాపానికి గురయ్యాడు. ఇద్దరు పిల్లలను చెట్టుకు ఉరివేసి తాను కూడా అదే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన బుధవారం సాయంత్రం తాండూరు మండలం గుండ్లమడుగుతండాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… తాండూరు మండలం గుండ్లమడుగు తండాకు చెందిన విజయ్చౌహాన్(౩౦)కు కర్ణాటక రాష్త్రం చించోళి తాలుకా చెన్ననూర్ గ్రామానికి చెందిన గీతాబాయితో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ మధ్య భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్య గీతాబాయి తన ఇద్దరు కుమారులను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇటీవల తండాలో గిరిజన ఆరాద్యదైవం జాతర నిర్వహించారు. జాతరకు కూడా భార్య రాలేదు. పండగ రోజు కూడా భార్య రాలేదని విజయ్చౌహాన్ మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం చెన్ననూరుకు వెళ్లి భార్యతో మాట్లాడాడు. ఇంటికి రమ్మని కోరాడు. అయినా ఆమె రావడానికి నిరాకరించింది. దీంతో అతడు పూర్తిగా మనస్తాపం చెందిన విజయ్చౌహాన్ తన ఇద్దరు కొడుకులను బలవంతంగా తీసుకెళ్లాడు. బుధవారం సాయంత్రం పొలం వద్ద చెట్టుకు ఇద్దరు పిల్లలకు ఉరివేశాడు. తరువాత అదే చెట్టుకు తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాండూరు రూరల్ సిఐ జలందర్రెడ్డి, కరణ్కోట్ ఎస్ఐ సంతోష్కుమార్లు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇద్దరు పిల్లలతో తండ్రి ఆత్మహత్య చేసుకోడంతో ఆ తండాలో విసాద ఛాయలు అలుముకున్నాయి.