Friday, April 26, 2024

పిల్లలకు విషమిచ్చి.. తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Father Committed Suicide by Poisoning Two Children

అమరావతి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టించింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సత్యనారాయణ అనే వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలతో మూత్రాసు కాలనీలో నివసించేవాడు. భార్య పుష్పలత గతేడాది నవంబర్ లో అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి కృంగుబాటు కు గురైన సత్యనారాయణ మంగళవారం రాత్రి పిల్లలు లోకేష్, తేజశ్రీకి విషమిచ్చి, తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Father Committed Suicide by Poisoning Two Children

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News