Thursday, April 25, 2024

కరోనాతో కొడుకు.. జ్ఞాపకాలను తలుచుకొని తండ్రి మృతి

- Advertisement -
- Advertisement -

father dies after son dies of covid in medchal

నాగారం: కరోనా మహమ్మారి బారిన పడి కొడుకు నాలుగు రోజుల క్రితం మృతిచెందాడు. ఆ ఘటన నుంచి కోలుకొని తండ్రి బెంగతో శనివారం మృత్యువాతపడ్డాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లిలో చోటుచేసుకుంది. కరోనా వారి కుటుంబం పాలిట పెను శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. రాంపల్లికి చెందిన నీరుడి వాసుకు కోవిడ్-19 సోకడంతో హైదరాబాద్‌ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు ఇక లేడని తీవ్ర మనోవేదనకు గురైన మృతుడి తండ్రి బాలయ్య కుమారుడి జ్ఞాపకాలను తలుచుకొని బాధపడుతూ ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

father dies after son dies of covid in medchal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News