Saturday, April 20, 2024

రంగారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని హత్య చేసిన కొడుకు

- Advertisement -
- Advertisement -

Father Killed by son in Rangareddy

రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల గుండాల మండలంలో దారుణ సంఘటన జరిగింది. కన్నతండ్రినే కొడుకు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన తండ్రిని చంపి పొలంలోనే పాతిపెట్టాడు. తండ్రిని హత్య చేసేందుకు కొడుకుకు తల్లి సహకరించింది. వివరాల్లోకి వెళితే.. కిష్టయ్య అనే వ్యక్తి నెలరోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో బంధువులు అతని కొడుకును నిలదీశారు. దీంతో తల్లీకొడుకులే కిష్టయ్యను హత్య చేసినట్లు తెలిసింది. దీంతో షాక్ గురైన బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Father Killed by son in Rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News