Saturday, April 20, 2024

కుమారుడిని తండ్రి కర్రతో బాదడంతో… మృతి

- Advertisement -
- Advertisement -

Father killed son in sangareddy

 

సంగారెడ్డి: కుమారుడిని తండ్రి కర్రతో కొట్టి చంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్తపల్లి గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. శ్రీనివాస్ గౌడ్ తాగుడుకు బానిస కావడంతో పలుమార్లు కుటుంబ సభ్యులతో గొడవపెట్టుకునేవాడు. శ్రీనివాస్‌గౌడ్ కు కుమారుడు, కుమార్తె ఉంది. శ్రీనివాస్ గౌడ్ కుమారుడు సాయి కుమార్ గౌడ్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం కుమార్తెకు పెళ్లి చేశారు. తండ్రి కొడుకులు మద్యం సేవించారు. కుమారుడు వద్ద ఉన్న ఏడు వేల రూపాయలు తనకు ఇవ్వాలని తండ్రి డిమాండ్ చేశాడు. డబ్బులు ఇచ్చేది లేదని తండ్రికి కుమారుడు చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. శ్రీనివాస్ గౌడ్ కోపంతో కుమారుడి తలపై బాదాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే సాయి కుమార్ గౌడ్ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News