Thursday, April 25, 2024

కుటుంబ కలహాలతో తండ్రి ఉన్మాదం

- Advertisement -
- Advertisement -
Father mania with family quarrels at Sangareddy
పిల్లలకు పురుగుల మందు తాగించి తాను తాగిన తండ్రి, చిన్నారి మృతి

సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మంగలి శివకుమార్ తన భార్య లలిత, ఇద్దరు కూతుర్లు శ్రీ కావ్య(5), నవ్యశ్రీ (3)తో హైదరాబాద్‌లోని సాయినగర్ బాచుపల్లిలో నివా సం ఉంటూ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గత కొన్నిరోజుల నుండి ఆర్థిక పరిస్థితులు బాగోక భార్య భర్తలు తర చూగొడవ పడుతున్నారు. ఆరు నెలల క్రితం ఆత్మకూరుకు వచ్చినప్పటి నుండి అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయితే మూడు రోజుల క్రితం భర్తతో గొడవ పెట్టుకొని లలిత ఆమె ఇద్దరు కూతుళ్లను తీసుకొని ఆమె పుట్టింటికి అల్లాదుర్గం వెళ్ళిపోయింది.

గురువారం మంగలి శివకుమార్ తన భార్య వద్దకు (అల్లాదుర్గం) వెళ్లి తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇద్దరు కూతుళ్లను తీసుకొని రాత్రికి సదాశివపేటలోని తన ఇంటికి చేరాడు. శుక్రవారం ఉదయం శివ కుమార్ థమ్సప్ కూల్ డ్రింక్స్‌లో పురుగుల మందు కలిపి తాను తాగి, తన ఇద్దరు కూతుళ్లకు తాగించాడు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్తులు చికిత్స నిమిత్తం ముగ్గురునీ అంబులెన్స్‌ల్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. వైద్యులు పరిశీలించగా నవ్య శ్రీ (3) చనిపోయినట్లు నిర్ధారించారు. పెద్ద కూతురు శ్రీ కావ్య(5) ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి నందు చికిత్స పొందుతోంది. శివ కుమార్‌కు వైద్యం అందించి, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News