లక్నో: ప్రేమ వ్యవహారంతో కన్న కూతురును చంపినట్టు తండ్రిపై ఆరోఫణలు వచ్చిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బహ్రేచ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సుభాష్ అనే వ్యక్తికి 17 ఏళ్ల కూతురు ఉంది. ఆమెకు ఓ యువకుడితో పెళ్లి చేసి అత్తాగారింటికి పంపించాడు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె తన తండ్రితో కలిసి ఉంటుంది. యువతి అదే గ్రామానికి చెందిన చోట్కౌతో ప్రేమలో పడింది. జూన్ 20న చోట్కౌ వ్యతిరేకంగా ఆమెతో కథనం రాయించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జూన్ 23న పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి చోట్కౌను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 23న సుభాష్ తన కూతురును చంపాడు. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి చోట్కౌ బంధువు ఇబ్రహ్మీం తన కూతురును హత్య చేశాడని ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి సుభాష్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. తన కూతురు మరో యువకుడితో ప్రేమ పడడంతో తన కుటుంబం పరువు పోయిందని ఈ హత్య చేశానని చెప్పుకొచ్చాడు.
ప్రేమ వ్యవహారం…. కూతురును చంపిన తండ్రి
- Advertisement -
- Advertisement -
- Advertisement -