చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. 75 రోజుల వయసు గల పసికందుపై తండ్రి అత్యాచారం చేసిన సంఘటన ఎరోడ్ జిల్లాలోని అంధియుర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వారం రోజుల క్రితం భార్య ఇంట్లో లేనప్పుడు రెండున్నర నెలల వయసు కలిగిన కన్నకూతురుపై కామపిశాచి తండ్రి అత్యాచారం చేస్తుండగా తల్లి అడ్డుకుంది. వెంటనే అతడికి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా కూతురిని తండ్రికి దూరంగా ఉంచింది. రెండో రోజుల క్రితం భార్య ఇంట్లో లేనప్పుడు కూతురుపై అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. కూతురు మర్మాంగాల వద్ద రక్తపు మరకలు ఉండడంతో తల్లి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పాపను సాలెమ్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. భర్తపై భవాని మహిళ పోలీస్ స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసుల పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
75 రోజుల పసికందుపై తండ్రి అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -
- Advertisement -