Thursday, April 25, 2024

తండ్రీకొడుకుల ప్రాణం తీసిన చేపల వేట

- Advertisement -
- Advertisement -

చేపల వేటకు వెళ్లి తండ్రికొడుకుల మృతి

Fish hunting

 

మనతెలంగాణ/కామారెడ్డిరూరల్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రి కొడుకులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం….. దేవునిపల్లి గ్రామానికి చెందిన షేక్ మీరా(31), అతని కుమారుడు షేక్ మౌలానా(6)లు శనివారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లుతున్నామని ఇంట్లో చెప్పి వెళ్లారు. చీకటి పడిన రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే ఆదివారం ఉదయం కామారెడ్డి పెద్ద చెరువులో వారిద్దరి మృతదేహలు కనిపించాయి. ఈ మేరకు కామారెడ్డి సిఐ చంద్రశేఖర్‌రెడ్డి, దేవునిపల్లి ఎస్‌ఐ కుంట శ్రీకాంత్‌లు సంఘటన స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాకపోవడంతో మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కుంట శ్రీకాంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News