- Advertisement -
వరంగల్ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి బస్సు చక్రాల కింద పడడంతో తండ్రీకొడుకులు మృతి చెందారు. బాలసముద్రం ప్రాంతానికి చెందిన గజ్జల సంజీవ్, రూపర్ పని నిమిత్తం బయటకు వెళ్తుండగా నక్కలగుట్ట సమీపంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు వద్ద బైక్ స్కిడ్ అయి బస్సు కిందకు వెళ్లిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.
- Advertisement -