Tuesday, April 23, 2024

ట్రాక్టర్ టైర్ల కిందపడి తండ్రి, తనయుడు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ట్రాక్టర్ కింద పడి తండ్రి, తనయుడు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపూరంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… దొనకొండ మండల కేంద్రానికి చెందిన కొండెబోయిన కొండయ్య(45), కుమారుడు శివ నాగరాజు (14) పనుగుల నిమిత్తం చంద్రవరానికి బైక్‌పై వెళ్తున్నారు. నీళ్ల ట్యాంకర్ తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా బైక్ అదుపుతప్పి ట్రాక్టర్ టైర్ల కిందపడిపోయారు. వారి పైనుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News