- Advertisement -
హైదరాబాద్: ఇప్పటికీ రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరమని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ట్యాంక్బండ్పై అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అణగారినన వర్గాలు, అణచివేతకు గురైన వారికోసం అంబేద్కర్ పోరాడిన మహానీయుడని ప్రశంసించారు. అన్ని వర్గాలు సమానంగా ఉండాలన్నదే అంబేద్కర లక్ష్యమన్నారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం పునరంకితం అవుదామని తన ఫేస్ బుక్ పేజీలో ఈటెల పోస్టు చేశారు.
- Advertisement -