Thursday, April 25, 2024

ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్‌గా హర్మన్, గుర్జిత్

- Advertisement -
- Advertisement -

FIH announces awards for 2020-21

ఎఫ్‌ఐహెచ్ అవార్డుల్లో భారత క్రీడాకారుల హవా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్‌ఐహెచ్) వార్షిక పురస్కారాల్లో భారత హాకీ క్రీడాకారులు అవార్డుల పంట పండించారు. 2020-21కి సంబంధించి ఎఫ్‌ఐహెచ్ అవార్డులను ప్రకటించింది. ఈ పురస్కారాల్లో భారత్‌కు చెందిన నలుగురికి అవార్డులు లభించాయి. ఇటీవల టోక్యో వేదికగా ఒలింపిక్స్‌లో భారత మహిళా, పురుషుల హాకీ జట్లు అద్భుత ఆటను కనబరిచిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించిన అవార్డుల్లో భారత క్రీడాకారులకు ప్రాధాన్యత లభించింది. పెనాల్టీ కార్నర్ నిపుణులు హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్‌లు పురుషులు, మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ పురస్కారాలను గెలుచుకున్నారు. పురుషుల విభాగంలో భారత్ కాంస్య పతకం సాధించడంలో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. ఇక మహిళల జట్టు సెమీఫైనల్లో చేరడంలో గుర్జిత్ కౌర్ ముఖ్య భూమిక పోషించింది. మరోవైపు పిఆర్ శ్రీజేష్, సవితా పునియాలు గోల్ కీపర్ ఆఫ్‌ది ఇయర్‌గా నిలిచారు.

వీరిద్దరూ కూడా అసాధారణ ప్రతిభతో ప్రత్యర్థి జట్లు గోల్ చేయకుండా అడ్డుకున్నారు. కాగా, ఎఫ్‌ఐహెచ్ అవార్డుల్ల చాలా కాలం తర్వాత భారత క్రీడాకారులకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు లభించడం విశేషం. టోక్యో ఒలింపిక్ క్రీడలు భారత హాకీకి పూర్వవైభవం తెచ్చి పెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషుల హాకీలో 41 ఏళ్ల తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకుంది. టోక్యో క్రీడల్లో భారత్ కాంస్యం కోసం జరిగిన పోరులో బలమైన జర్మనీని చిత్తుగా ఓడించి పతకం కొరతను తీర్చింది. మహిళల జట్టు పతకం సాధించక పోయినా అసాధారణ ఆటతో నాలుగో స్థానంలో నిలిచి పెను ప్రకంపనలు సృష్టించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News