Friday, April 19, 2024

వరద బాధితుల కోసం సినీ ప్రముఖుల ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance from Tollywood celebrities for flood victims

 

హైదరాబాద్ : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలకు నిలువ నీడ లేకుండా పోతోంది. సర్వం కోల్పోయిన వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. మెగాస్టార్ చిరంజీవి రూ. 1 కోటి విరాళం ప్రకటించగా.. నాగార్జున రూ. 50 లక్షలు, తారక్ రూ. 50 లక్షలు, మహేష్ బాబు రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండ రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. వీరితో పాటు  డైరెక్టర్ హరీష్ శంకర్ 5 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు హీరో నందమూరి బాలకృష్ణ కోటిన్నర రూపాయాలను విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News