Friday, April 19, 2024

కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to Constable family

 

మనతెలంగాణ, హైదరాబాద్ : క్యాన్సర్‌తో మృతిచెందిన కానినస్టేబుల్ చంద్రయ్య కుటుంబ సభ్యులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో శనివారం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అందజేశారు. కానిస్టేబుల భార్య రేణుక, కుటుంబ సభ్యులకు రూ.2.70లక్షల చెక్కును ఇచ్చారు. శంషాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చంద్రయ్య 2020, ఏప్రిల్17వ తేదీన లీవర్ క్యాన్సర్‌తో మృతిచెందాడు. 2000 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన సిబ్బంది విరాళంగా రూ.2.70లక్షలు విరాళంగా ఇచ్చారు. వాటిని సిపి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేష్, దుర్గాప్రసాద్, సత్తయ్య, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News