Thursday, April 25, 2024

గీత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to the Geetha Karmika family

 

మనతెలంగాణ/హైదరాబాద్: తాటి చెట్టుపై మృతిచెందిన గీత కార్మికుడి కుటుంబానికి కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ తక్షణ సాయాన్ని అందజేసింది. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామ గీత కార్మికుడు గుగ్గిళ్ళ కృష్ణయ్యగౌడ్ ఈ నెల 15న తాటి చెట్టుపైన మోకు జారడంతో ప్రాణాలు విడిచాడు. నిరుపేద కుటుంబానికి కల్లుగీత పారిశ్రామిక ఆర్థిక సహకార కార్పొరేషన్ నుంచి దహన సంస్కారాల కోసం రూ. 25 వేల చెక్కును కార్పొరేషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారి ఆదేశం మేరకు శనివారం కృష్ణయ్య భార్య గుగ్గిళ్ళ పద్మకు జూనియర్ అసిస్టెంట్ రవీందర్‌గౌడ్, సంపూర్ణ అందజేశారు. మంత్రులు కెటిఆర్, శ్రీనివాస్‌గౌడ్‌కు, బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎండి ఉదయప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ప్రతినిధులు వెల్లడించారు. గీత కార్మికుడి కుటుంబానికి తక్షణమే ఎక్స్ గ్రేషియాతో పాటు వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి.రమణ, ఉపాధ్యక్షులు కోహెడ కొమురయ్యగౌడ్, రాష్ట్ర కార్యదర్శి బండకింది అరుణ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News