- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ రైల్వే స్టేషన్ లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా ఫ్లాట్ ఫాంపై నిలిపి ఉంచిన ఎంఎంటీఎస్ ట్రైన్ బోగీలో మంటలు చెలరేగాయి. ఓ బోగి నుంచి మరో రెండు బోగీలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. పరిమిత రైలు సర్వీసుల వల్ల పక్కకు నిలిపి ఉంచిన బోగీల్లో మంటలు అంటుకున్నట్టు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Fire Accident at Medchal Railway Station
- Advertisement -