- Advertisement -
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటిలో అగ్నిప్రమాదం ఆదివారం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ఏ1 బ్లాక్ మొదటి అంతస్తులో మంటు చెలరేగాయి. మంటలు ఎక్కవగా వ్యాపించడంతో తరగతి గదిలోని 60 కుర్చీలు, 21 బల్లలు, ప్రొజెక్టర్ దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగతో కమ్మేసింది. అధికారుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
- Advertisement -