Wednesday, April 24, 2024

బిస్కెట్ కంపెనీలో అగ్నిప్రమాదం

- Advertisement -
Fire accident,
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండంలోని మేకగూడ శివారులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. బిస్కెట్ పరిశ్రమలో గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదంలో ఎంత ఆస్తినష్టం జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు.
Fire Accident in Biscuit Factory at Ranga Reddy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News