- Advertisement -
సంగారెడ్డి: జిల్లాలోని బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో పరిశ్రమ నుంచి కార్మికులు బయటకు పరుగులుతీశారు. కొందరు కార్మికులు పరిశ్రమంలోనే చిక్కకున్నట్లు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి. పేలుడు వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్టు స్థానికులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Fire Accident in Bollaram Industrial Estate
- Advertisement -