Thursday, March 28, 2024

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire-accident

మేడ్చల్: జీడిమెట్ల పారిశ్రామిక వాడ లోని సుభాష్ నగర్ గంపల బస్తీ లోని స్క్రాబ్ గోడౌన్ లలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.  షార్ట్ సర్క్యూట్ తో ఓస్క్రాబ్ గోడౌన్లో మంటలు చెలరేగి పక్కన ఉన్న మరో రెండు గోడౌన్ లకు మంటలు వ్యాప్తి చెందడంతో… మొత్తం 3 స్క్రాబ్ గోడౌన్ లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ  ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.

ఇనుప స్క్రాబ్ నిలువ ఉంచిన గోడౌన్ లో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ప్రక్కనే ఉన్న మరో రెండు స్క్రాబ్ గోదాముల కు వ్యాపించాయి. గోడౌన్ లలో వేస్ట్ కరెంటు సామానులు, వేస్టు ప్లాస్టిక్ డ్రమ్ములు, ఐరన్ ను నిలువ ఉంచిన వాటికి మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి.  ఆస్తి నష్టం సుమారు లక్ష ముప్పై వేల రూపాయలు ఉండవచ్చని అదికారులు అంచనా వేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. చుట్టుపక్కల జనావాసాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. అధికారులు మాముళ్ళకు ఆశ పడి అక్రమ గోడౌన్ లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేరని, ఇలాంటి అక్రమ గోడౌన్ లను వెంటనే ఇక్కడి నుండి అవుటర్ రింగ్ రోడ్డుకు అవుతల తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Fire accident in Jeedimetla Industrial Area

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News