Wednesday, April 24, 2024

రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire accident in Mailardevpally

రంగారెడ్డి: రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్ దేవిపల్లిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. అన్సారీ రోడ్డులో ఫర్నీచర్ దుకాణం దగ్ధమైంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News