- Advertisement -
సంగారెడ్డి: రన్నింగ్ లో ఉన్న ప్రైవేటు బస్సులో మంటలు అంటుకోవడంతో అది పూర్తిగా దగ్ధమైన సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్సులో మంటలు రావడంతో ప్రయాణికులు కిందకు దిగిపోయారు. ప్రయాణికులు చూస్తుండగానే బస్సు తగలబడిపోయింది. ప్రయాణికులు సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నమాపక సిబ్బంది భావిస్తున్నారు.
Fire accident in Private travels bus in Sangareddy
- Advertisement -