- Advertisement -
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం గేట్ వద్ద గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఆయిల్ మిల్లులో మంటలు అంటుకున్నాయి. మంటలు ఎగిసిపడి, పొగకమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటులను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆస్తి నష్టం ఎంత వాటిల్లింది, ప్రమాదానికి కారణాలను పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
Fire Accident in Rangareddy District
- Advertisement -