Friday, April 26, 2024

నల్లమలలో కార్చిచ్చు.. వందల హెక్టార్లలో వ్యాపించిన మంటలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్:నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని నల్లమల అటవి ప్రాంతంలో బుధవారం మరో మారు కార్చిచ్చు రగులుకొని అడవికి తగలబడుతుంది. 15 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు 10 ఘటనలు చోటు చేసుకోవడంతో అటవి శాఖ అధికారులకు ఊపిరి సల్పడం లేదు. అటవి శాఖ అధికారులు అచ్చంపేట నుంచి శ్రీశైలం వరకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్విక్ రెస్పాన్స్ టీంలను అందుబాటులో ఉంచిన కార్చిచ్చు మాత్రం ఆగడం లేదు. రోడ్డు పక్క నుంచి కార్చిచ్చు మొదలై చిట్టడవిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి. మొదటి సారి అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని రాసమళ్ళ బావి నుంచి ప్రారంభమైన కార్చిచ్చు వరుసగా ఏదో ఒకచోట రెండు రోజులకు ఒకసారి వెలుగుచూస్తుండడంతో అటవి శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. శ్రీశైలం రహదారి వెంట శివభక్తులు వెళ్తుండడం, పర్యాటకులు, ప్రయాణికులు వంటలు చేసి నిప్పును ఆర్పకపోవడం కొందరు సిగరేట్, బీడిలు కాల్చి అడవిలో పారవేస్తున్న మానవ ఘటనలే కార్చిచ్చుకు కారణంగా అటవిశాఖ భావిస్తుంది.

తాజాగా నల్లమల అటవిప్రాంతంలోని దోమలపెంట అటవి రేంజ్ పరిధిలోని తాటిగుండాల బ్లాక్‌లోని ఉల్లిందన ఏరియాలో బుధవారం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కొన్ని వందల హెక్టార్లలో ఎండుగడ్డి, చిన్నా చితకా చెట్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన అటవి అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటివరకు రాసమళ్ళబావి,ఉర్రుమండ, ఆక్టోపస్‌వ్యూ పాయింట్, పదర పరిధిలోని మద్దిమడుగు కాకిరెమ్మ పెంట అటవి ప్రాంతంలో కార్చిచ్చు రగిలిన విషయం విధితమే. ఈ నెల 14వ తేదిన దోమల పెంట రేంజ్ పరిధిలోని కొల్లం, కొమ్మనపెంట, వటవర్లపల్లి సమీపంలోని సందూటి సార్వ ప్రాంతాలలో మంటలు అంటుకున్నాయి. ఇక్కడ కూడా వందలాది ఎకరాల విస్తీర్ణంలో అటవి ప్రాంతం అగ్నికి ఆహుతి అయ్యింది. ఇప్పటివరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వులోని నల్లమల అటవి ప్రాంతంలో వేలాది హెక్టార్లలో జరిగిన కార్చిచ్చుల కారణంగా గడ్డి, చిన్నాచితకా చెట్లు, పక్షులు, పాములు, ఉడుముల, బల్లిజాతులు వంటివి ఈ కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Fire burns in Nallamala Forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News