Thursday, April 25, 2024

ముంబయి బహుళ అంతస్తు భవనంలో అగ్నిప్రమాదం

- Advertisement -
Fire in Mumbai Building
ఒకరు  మృతి
ముంబయి: ఇక్కడి లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తు బిల్డింగ్‌లోని 19వ ఫ్లోర్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 4వ లెవల్ అగ్నిప్రమాదం కారణంగా ఒకరు మృతి చెందారు. ప్రమాదస్థలికి అనేక అగ్నిమాపక వాహనాలు తరలాయి. ఏడు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. అగ్నిప్రమాదంలో మరణించిన వ్యక్తిని అరుణ్ తివారీగా గుర్తించారు. అతడి భౌతిక కాయాన్ని కెఇఎం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రమాదస్థలికి ముంబయి మేయర్ కిశోరి పెడెనెకర్, మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్, ఇతర అగ్నిమాపక అధికారులు చేరుకున్నారు. భవనం 19వ అంతస్తులో అగ్నికీలలు పెల్లుబుకుతున్న దృశ్యాలు ఫోటోల్లో బందీ అయ్యాయి. కొన్ని మైళ్ల దూరం వరకు నల్లని దట్టమైన పొగలు కనిపించాయి.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News