Friday, April 26, 2024

ద్వీప దేశంలో మొదటి కరోనా కేసు

- Advertisement -
- Advertisement -

First corona case in Wellington

వెల్లింగ్టన్ : కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్‌లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు అయింది. ఇటీవలే కుటుంబంతోసహా ఇక్కడికి చేరుకుని క్వారంటైన్‌లో ఉన్న ఓ పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ఆ దేశ ప్రధాని మార్క్‌బ్రౌన్ ఓ ప్రకటనలో తెలిపారు. వారు న్యూజిలాండ్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. పసిఫిక్ మహా సముద్రం లోని ఈ ద్వీప దేశంలో దాదాపు మొత్తం 17 వేల మంది జనాభాలో అర్హులైన వారిలో దాదాపు 96 శాతం మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభం లోనే ఈ దేశం ఇతర దేశాలతో రాకపోకలు తెంచుకుంది. ఇటీవలే జనవరి 14 నుంచి న్యూజిలాండ్‌తో క్వారంటైన్ రహిత ప్రయాణాలను తిరిగి ప్రారంభించే విషయమై ప్రణాళికలు ప్రకటించింది. ఇదే తరుణంలో కరోనా మొదటి కేసు బయటపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News