- Advertisement -
ఖమ్మం: జిల్లాలో తొలి కరోనా పాజిటీవ్ కేసు నమోదైనట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి కరోనాను ఎదుర్కొవాలని, కరోనా విషయంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సురక్షితంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దయచేసి ప్రజలందరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, చైతన్యంతో ఉండి కరోనాను ఎదర్కొవాలన్నారు. లాక్ డౌన్ ను ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేయాలని మంత్రి కోరారు. స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు పోస్టు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటామని మంత్రి పువ్వాడ తెలిపారు.
First Corona Positive Case Registered in Khammam Dist
- Advertisement -