Friday, April 19, 2024

వల చిక్కుకొని మత్స్యకారుడు మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కొల్చారం: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ యువకుడు వల చిక్కుకుని మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని యనగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం స్థానిక చాకిరి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన చిలుక రాజు(32) ప్రమాదవశాత్తు చేపల వల కాళ్లకు చిక్కడంతో ఘటన స్థలంలోనే మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు ఈ మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News