Friday, April 19, 2024

నీటిలో పడి మత్స్యకారుడు మృతి

- Advertisement -
- Advertisement -

Fisher men dead in Middle manair project

సిరిసిల్ల రూరల్‌ : రాజరాజేశ్వర ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృత్యువాతపడిన సంఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో జరిగింది. గంగు పరుశరాములు (54) అనే వ్యక్తి రోజు చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం తోటి మత్య్సకారులతో కలిసి రాజరాజేశ్వర ప్రాజెక్టులో చేపలవేటకు వెళ్లాడు. చేపలు పడుతుండగా తెప్పలపై నుంచి నీటిలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి మత్స్యకారులు అతడిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అతడు మృత్యువాతపడ్డాడు. దీంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News